KRNL: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలు, జలాశయాలకు మరమ్మతులు నిర్వహణకు (ఓఅండ్ఎం) సంబంధించి 474 పనులకు రూ.37.31 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు నీటి సంఘాలు లేనిచోట స్వల్పకాలిక టెండర్లను ఆహ్వానించి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. KCC, LLC.. తెలుగుగంగ, SRBC మరమ్మత్తులు, నిర్వహణ పనులు చేపట్టనున్నారు.