NGKL: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని శనివారం కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. జూన్ 2న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాక ఆవిష్కరణ, అమరవీరులకు నివాళి, సంక్షేమ పథకాల వివరణతో వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.