KRNL: క్రిష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల కొండలో చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం పొలాలకు వెళ్లిన రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. దీంతో పశువుల కాపర్లు, రైతులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ తక్షణమే స్పందించాలని యువత అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, సర్పంచ్ రవిమోహన్ డిమాండ్ చేశారు.