WG: ప్రతికౌలు రైతు పంట సాగుదారు హక్కు పత్రం తప్పనిసరిగా పొందాలని తద్వారా పంట రుణాలు పొందడానికి సాధ్యమవుతుందని జేసీ రాహుల్ అన్నారు. శనివారం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కౌలు రైతుకు పంట సాగుదారు హక్కు చట్టం 2019 లోబడి కొన్ని షరతులు వర్తిస్తాయన్నారు. పంటరుణం, పంట భీమా, నష్టము పొందడానికి వీలవుతుందన్నారు.