ELR: వేసవి విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 137 జూనియర్ కళాశాలలున్నాయి. 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన 1,919 మంది విద్యార్థులతోపాటు, కొత్తగా ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు హాజరుకావాలని డీఐఈవో టి. శేఖర్ బాబు తెలిపారు.