W.G: పని చేస్తున్న ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చేస్తే పోష్ చట్టం ప్రకారం శిక్షార్హులని ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీ నారాయణ అన్నారు. శనివారం సుప్రీంకోర్టు ఆదేశాలతో భీమవరంలో 3వ అదనపు జిల్లా కోర్టులో ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు పోష్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 2013 సంవత్సరం నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిందన్నారు.