MBNR: జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి మరో రెండు 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్లు మంజురైనట్లు శనివారం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో రూ. 3.56 కోట్ల వ్యయంతో, మిడ్జిల్ మండలం మున్నానుర్ గ్రామంలో రూ.3.61 కోట్ల వ్యయంతో ఈ కొత్త సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు.