VZM: జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. పని ప్రదేశాల్లో మహిళలపై ఎవరైనా లైంగిక పరమైన వేధింపులకు పాల్పడితే (POSH) లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు. వారిపై శిక్షలు కఠినంగా ఉంటాయని తెలిపారు.