W.G: మద్యానికి బానిసై భార్య, కుమారైపై ఓ వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేసిన ఘటన శనివారం ఇరగవరం మండలంలో జరిగింది. మండలంలోని అర్జునుడుపాలెంకు చెందిన రాంబాబు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్య లక్ష్మీ తులసి, కుమార్తెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన వీరిని స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.