HNK: కాకతీయ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగ పరిశోధక విద్యార్థిని నేరెళ్ల శైలజకు డాక్టరేట్ ప్రకటించబడింది. పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ సోమవారం ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె ‘తెలంగాణ రాష్ట్రంలో ఆహార పంటలు & ఆహారేతర పంటల ఆర్థిక విశ్లేషణ – ఉత్తర తెలంగాణ అధ్యయనం’ అనే అంశంపై విశ్రాంత ఆచార్యులు భాస్కర్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.