KMR: ఇంటర్, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి, బాన్సువాడ డిపోల పరిధిలో విద్యార్థులు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపాలని డిపో మేనేజర్లు డ్రైవర్లను ఆదేశించారు. మార్చి 16 వరకు ఇంటర్, ఏప్రిల్ 7 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఈ వెసులుబాటు కల్పించారు.