SDPT: జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఈనెల 28న సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జి సునీత తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం, వారి అభిప్రాయాల సేకరణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.