NGKL: సలేశ్వరం జాతరకు వెళ్లే రహదారి ఎర్రమట్టి దుమ్ముతో నిండిపోయింది. వాహనాల తాకిడికి దుమ్ము భారీగా లేవడంతో తెల్లటి వాహనాలు ఎరుపు రంగులోకి మారుతున్నాయి. బైక్ భక్తులు తల నుంచి కాలి వరకు మట్టితో నిండిపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై నీళ్లు చల్లించి దుమ్ము లేవకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.