ASF: జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. మార్చ్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ పరిశీలకుడు అంబటి శివప్రసాద్ హెచ్చరించారు. ముఖ్యంగా మార్చి 5 నుంచి 8 వరకు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.