KNR: హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ భూస్థాపితమవడం ఖాయమని కాంగ్రెస్ నేత ప్రణవ్ స్పష్టంచేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం దేవతల సాక్షిగా చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీని దూషించడం ఆయన మతిభ్రమణానికి నిదర్శనమని, ఆయన మీద ఉన్న కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.