NRML: కుబీర్ మండల కేంద్రానికి చెందిన ఫయాజ్ (45) అనే వ్యక్తి భైంసా మండలంలోని గుండెగాం వాగులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఫయాజ్, తండ్రితో కలిసి ఆదివారం సాయంత్రం చేపలు వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.