HYD: మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మహిళా కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్లో ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ బలోపేతానికి మహిళా కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.