GDWL: ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్ ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం అయిజ పట్టణంలోని ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈనెల 25లోగా రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.