JN: అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా 2027 సంవత్సరానికి అగ్నివీర్ పురుష నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా యువజన, క్రీడల అధికారి కోదండరాములు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివాహం కాని పురుష అభ్యర్థులు, కనీసం 8వ తరగతి చదివిన వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. అర్హత గలవారు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.