WGL: రాయపర్తి మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఐతరాజ్ మాదిగ మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారికి ఘనంగా నివాళులర్పించామని పేర్కొన్నారు. మార్చి 1న అమరవీరులను స్మరించుకోవడం జరుగుతోందన్నారు.