VKB: గ్రామపంచాయతీ కార్మికుల ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడి సందర్భంగా సీపీఎం నాయకుల ముందస్తు అరెస్టులను జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ ఖండించారు. అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు పనికి తగ్గ వేతనం చెల్లించి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.