వనపర్తి పట్టణం 6వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోకం పాండు హైదరాబాదులోని రేంజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం ఆయనను పరామర్శించడు. అనంతరం వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడవద్దు అని, అండగా ఉంటానని భరోసానిచ్చారు.