PDPL: ధర్మారం మండలం మేడారంలో ఇవాళ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీర్పాల్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవికాలం దృష్ట్యా తాగునీటి సమస్య, డ్రైనేజీ, విద్యుత్ దీపాల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం పంచాయతీ ఆధ్వర్యంలోని వారసంత, వాణిజ్య దుకాణాలకు వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రమేష్, కార్యదర్శి మౌనిక, ఉపసర్పంచ్ రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.