సంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలకు 15,515 మందికి 15,209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. 98.03% హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. రెండో రోజు ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు చెప్పారు.