MDCL: దివ్యాంగులకు నెలకు రూ. 6 వేల పెన్షన్ హామీని వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి, హామీ అమలు కాకపోవడంపై నిరసన తెలిపారు. పలుమార్లు వినతులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. దివ్యాంగుల హక్కుల చట్టం అమలులోనూ నిర్లక్ష్యం ఉందని పేర్కొంటూ అమలు చేయాలని కోరారు.