KMM: ముదిగొండ మండలం మల్లన్నపాలెం గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఇవాళ ఎస్కే కాసీం, గ్రామ మాజీ సర్పంచ్ ప్రారంభించారు. పలువురు గ్రామస్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోలేటి నాగేశ్వరరావు, చిలకల రామకృష్ణ, నంజాల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.