GNTR: మున్సిపల్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్(DYC), ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం జరుగుతుందని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు DYC, తదనంతరం పీజీఆర్ఎస్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరుగుతుందని చెప్పారు. నగర ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.