RR: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందిగామ, కొత్తూరు, కేశంపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. 300 మంది లబ్ధిదారులకు రూ. 1.50 కోట్ల విలువైన చెక్కులు మంజూరయ్యాయన్నారు.