NRML: సారంగాపూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ జాం పాఠశాలలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప అటవీ క్షేత్రాధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ పాల్గొని పిచ్చుకల ప్రాముఖ్యత, వాటి అంతరించడానికి కారణాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.