KMM: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, మెప్మా సమన్వయంతో (PM SVANidhi) లబ్ధిదారులైన వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి పాల్గొని మాట్లాడుతూ.. వ్యాపార లాభాల్లో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడంలోని ప్రాముఖ్యత డిజిటల్ లావాదేవీలుపై అవగాహన కల్పించారు.