హన్మకొండ: హసనపర్తి మండల కేంద్రంలోని మసీద్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్నం అయిందని యజమాని రాజు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న చేరాల సీఐ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలు అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.