MBNR: వేసవి తాపం కారణంగా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్సై శేఖర్ రెడ్డి సూచించారు. పాఠశాలలు త్వరగా ముగియడంతో పిల్లలను నిర్లక్ష్యంగా బయటకు పంపకూడదన్నారు. బావులు, చెరువులు, కుంటల వద్ద పర్యవేక్షణ లేకుండా వెళ్లనివ్వవద్దని హెచ్చరించారు. వేసవిలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.