SDPT: జిల్లా కలెక్టర్ కె.హైమావతి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశలు, నిలిచిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంజూరైన ఇల్లు గ్రౌండింగ్ కావాలని, ఎంపీడీఓలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు.