MNCL: జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ ప్రభుత్వ యుపిఎస్ పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు గురుకుల విద్యాలయానికి ఎంపికయ్యారని హెచ్ఎం సత్తయ్య తెలిపారు. ఇవాళ పాఠశాల ఆవరణలో గురుకులానికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. తమ పాఠశాలకు చెందిన సందీప్, కీర్తన, అవంతిక, తన్మైశ్రీ, హర్శిని, ఆరుష్,అహల్య, శ్రీజన్ కుమార్ ఉన్నారు.