KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్కు మొత్తం 40 వాహనాల్లో 296 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా రూ.7,600 ధర పలికింది. మార్కెట్లో కార్యకలాపాలను మార్కెట్ ఛైర్పర్సన్ స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు. తాజాగా పత్తి ధర రూ.50 పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.