SS: విదేశీ పక్షుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. చిలమత్తూరు మండలం వీరాపురంలో సైబీరియన్ పక్షులకు అవసరమైన ఆహారం, నీరు సమకూరుస్తామన్నారు. పక్షి పిల్లల సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని, ఎన్జీవోల సహకారం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు, వాచ్ టవర్ ఏర్పాటు చేశామన్నారు.