ATP: శింగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. గురువారం హెచ్ఎల్సీ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కాలువల మరమ్మతులు, చెరువుల నింపుదలపై చర్చించారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీఎస్సీ, టీబీసీ కాలువల్లో నీటి లీకేజీల నివారణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.