మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం దర్శనం కోసం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను సీఎంకు అందజేశారు. అంతకు ముందు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా జరిగింది.