NGKL: ఎర్రవల్లి ముంపు బాధితులు ఆదివారం హైదరాబాద్లో ఎంపీ మల్లు రవిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రిజర్వాయర్ ముంపు నుంచి మినహాయింపు కోరుతూ.. 100 రోజులుగా దీక్ష చేస్తున్నామని, న్యాయం చేయాలని వేడుకున్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.