KMR: ఇటీవల ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశ్రయుడైన రైతు మచ్కురి కిష్టయ్యకు అన్నారం గ్రామస్థులు అండగా నిలిచారు. గ్రామ యువత చొరవతో విరాళాలు సేకరించి రూ.30,000 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండటం మన కర్తవ్యమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. బాధితుడికి భరోసానిస్తూ యువత చాటిన మానవత్వాన్ని పలువురు అభినందించారు.