ధోనీ, కోహ్లీ, రోహిత్, మనీష్ పాండే IPL – FAB 4గా కొనసాగుతున్నారు. తొలి సీజన్ 2008 నుంచి ఆడుతున్న ఈ నలుగురు.. మరో 8 రోజుల్లో ప్రారంభమయ్యే 19వ సీజన్ కోసం సిద్ధమవుతూ యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచారు. తొలి నుంచి కోహ్లీ RCB తరఫునే ఆడుతుండగా.. ధోనీ CSKతో పాటు గతంలో RPS కోసం ఆడాడు. రోహిత్ డెక్కన్ ఛార్జర్స్, MI కోసం ఆడగా.. పాండే(ఇప్పుడు KKR) 7 జట్ల తరఫున బరిలోకి దిగాడు.