AKP: ఎస్ రాయవరం మండలం గుడివాడకు చెందిన మల్లపురాజు సత్యనారాయణ రాజుకు సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు అయింది. ఈ మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, పార్టీ నాయకులు వెంకటరాజు, కోడ లోవరాజు, సుంకర శ్రీనివాసరావు ఇవాళ లబ్ధిదారుడికి రూ.53,284 చెక్కును అందజేశారు. అబద్ధం మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.