SRPT: గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సర్వారం గ్రామానికి చెందిన కాంతయ్యను గరిడేపల్లి పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా ఎస్సై నరేష్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాపీని అందజేశారు.