MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులే ఉపాధ్యాయులుగా పిల్లలకు పాఠాలు బోధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్, ఉపాధ్యాయులు సుకన్య, జ్యోతి, తాజా మాజీ విద్యా కమిటీ చైర్మన్ రతన్ లాల్ పాల్గొన్నారు.