NRML: నిర్మల్ పట్టణంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక రెండో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా శనివారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి 26, 28 వార్డుల్లో పర్యటించి పరిశుభ్రత, తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించారు. కాలనీల సమస్యలను తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.