పెద్దపల్లి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల శోభాయాత్ర ఘనంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక కంసరి బావి హనుమాన్ ఆలయం నుంచి జండా చౌరస్తా, మెయిన్ రోడ్, అమర్ నగర్ మీదుగా యాత్ర కొనసాగింది. జైశ్రీరామ్ నినాదాలతో, టపాసులు కాల్చుతూ, డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.