SRCL: తంగళ్ళపల్లి మండలం పెద్ద పాపాయ్య పల్లి చెరువులో పడి ఇద్దరు రైల్వే ట్రాక్ కూలీల మృతి చెందారు. రైల్వే ట్రాక్ పనులకు వివిధ రాష్ట్రాల కూలీలు వచ్చారు. ఇవాళ హోలీ వేడుకలు జరుపుకున్న అనంతరం జైనూరుకు చెందిన నాగార్జున, గుంటూరుకు చెందిన రత్తయ్య స్నానం చేసేందుకు సమీప చెరువులోకి వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయారు. ఒక మృతదేహం లభ్యం కాగా మరో మృతదేహం దొరకలేదు.