సంగారెడ్డి: 2024 నవంబర్లో కుల గణన సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలని సిర్గాపూర్ PRTU మండల శాఖ ఆధ్వర్యంలో MPDO ఆఫీసులో సూపరింటెండెంట్కు శనివారం వినతి పత్రం అందించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని మండల శాఖ అధ్యక్షులు కర్ర నర్సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.