KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య చొరవతో చిమ్మపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే చిన్న ప్రోత్సాహం వారి పెద్ద కలలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.