ASF: రెబ్బెన మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు MRO సూర్య ప్రకాశ్ గురువారం తెలిపారు. నారాయణపూర్, కొమురవెల్లి నుంచి మంచిర్యాలకు అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న ఇసుకను అడ్డుకొని ట్రాక్టర్ ఓనర్ కాదబండి ప్రవీణ్ కు రూ.5,000ల జరిమానా విధించినట్లు చెప్పారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MRO హెచ్చరించారు.